అల్-గఫ్ఫార్ యొక్క కరుణా కారుణ్యాలు
దైవప్రవక్త (సల్లం) ప్రబోధించారని హజ్రత్ అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ తెలియజేశారు.“జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందువరకూ అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు.” ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి హసన్ గా ఖరారు చేశారు.
(సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలో చరమ ఘడియలకంటే ముందు పశ్చాత్తాపం ఆమోదించబడుతుందన్న ఆధ్యాయంలో ఈ హదీసు ప్రస్తావించబడింది.)
ముఖ్యాంశాలు
పై హదీసులో “గర్ గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట.
ఈ హదీసును 'హసన్'గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్ హదీసుల ఉల్లేఖకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్థం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్ హదీసుల మాదిరిగా “హసన్" కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే.

0 comments:
Post a Comment