సామూహిక నమాజు
దైవప్రవక్త ముహమ్మద్(సల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైరా (రధి) తెలిపారు: “మనిషి సామూహికంగా చేసే నమాజు అతను తన ఇంట్లో లేక బజారులో చేసే నమాజుకన్నా ఇరవై రెట్లకు పైగా ఘనమైనది” ఎందుకంటే ఒక వ్యక్తి చక్కగా వుజూ చేసుకుంటాడు, తరువాత నమాజు కోసం మస్జిద్ కు వస్తాడు. నమాజు మాత్రమే అతణ్ణి మస్జిద్ కు తీసుకువస్తే - అలాంటి వ్యక్తి మస్జిద్, చేరుకునేంత వరకూ అతను వేసే ఒక్కో ; అడుగుకు బదులుగా అతని ఒక్కో అంతసు పెరుగుతూ ఉంటుంది. అతని వల్ల జరిగిన ఒక్కో పాపం తొలగించబడుతూ ఉంటుంది. ఆ తరువాత మస్జిద్ లో ప్రవేశించిన పిదప నమాజు అతన్ని ఆపివుంచినంత సేపూ అతను నమాజు చేస్తున్నట్లుగానే పరిగణించబడతాడు. మీలో ఎవడైనా నమాజు చేసిన స్థానంలో కూర్చొని ఉన్నంత వరకూ దైవదూతలు అతనిపై అల్లాహ్ కారుణ్యం కురవాలని వేడుకుంటూనే ఉంటారు. ఆ వ్యక్తి పరులకు హాని కలిగించనంతవరకు, అతని వుజూ భంగం కానంతవరకు దైవదూతలు “ఓ అల్లాహ్! ఈ వ్యక్తిని కరుణించు. ఓ అల్లాహ్ ! ఇతన్ని మన్నించు. ఓ అల్లాహ్! ఇతన్ని కనిపెట్టుకుని ఉండు" అని విన్నవించుకుంటూ ఉంటారు
(హదీసు గ్రంథాలు బుఖారీ - ముస్లిం)
హదీసు వాక్యాలు మాత్రం ముస్లింలోనివి. హదీసులో వచ్చిన పదం “యన్ హుజుహూ" అంటే అతన్ని బయటికి తీసుకు వస్తుంది లేక అతన్ని లేపుతుందని అర్థం.
(సహీహ్ బుఖారీలోని నమాజు ప్రకరణం. సహీహ్ ముస్లింలోని నమాజు ప్రకరణం)




